కావలసినవి:
చికెన్ – 500 గ్రా//
ఉల్లిపాయలు – 4
టమాటాలు పెద్దవి – 2
కరివేపాకు – 4 రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 3 టీ స్పూన్స్
ఉప్పు – రుచికి తగినంత
నూనె – 1 కప్పు
మసాలా ముద్ద కోసం కావలసినవి:
ధనియాలు – 2 టీ స్పూన్స్
జీలకర్ర – 1/2 టీ స్పూన్
ఎండుమిర్చి – 8
మిరియాలు – 1/2 టీ స్పూన్
అనాసపువ్వు – 1
మరాఠీ మొగ్గ – 2
తయారు చేసే విధానం:
- శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలకి ఉప్పు,పసుపు పట్టించి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
- మసాలా ముద్ద కోసం తీసుకున్న వస్తువులనన్నిటినీ సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి.
- వేయించుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీలో వేసి మెత్తని ముద్దగా రుబ్బుకోవాలి.
- ఈ ముద్దలో నుండి కొద్దిగా తీసుకుని ముందే మారినేట్ చేసిన చికెన్ ముక్కలకి పట్టించుకోవాలి.
- ఒక గిన్నెలో చికెన్ వేసి నీరు ఇంకే వరకు ఉడికించుకోవాలి.
- తర్వాత బాణలిలో నూనె పోసి వేడి చెయ్యాలి.ఇందులో ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్నివేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇదే నూనెలో ఉల్లిపాయముక్కలు,అల్లంవెల్లుల్లి పేస్ట్,మిగిలిన మసాలాముద్ద వేసి దోరగా వేయించుకోవాలి.ఇందులో టమాటా ముక్కలు కూడా వేసి 5 నిమిషాలు వేగనివ్వాలి.
- ఇందులో వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి కూర ఫ్రై గా అయ్యేవరకు వేయించి,
- కరివేపాకు కొత్తిమీర చల్లుకుని దించేయాలి.
Leave a Reply